నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026
నేటి నిఘా న్యూస్ అవినీతి అక్రమాల పై నీడల వెంటాడే నేటి నిఘా న్యూస్ @Netinigha.

రాజస్థాన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Rajasthan Day): 1949లో ఇదే రోజున రాజపుత్ర సంస్థానాలన్నీ కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. వైకోమ్ సత్యాగ్రహం (1924): కేరళలోని వైకోమ్ ఆలయ వీధుల్లో అంటరానితనంపై చారిత్రాత్మక పోరాటం నేడే ప్రారంభమైంది. ఇది భారత సామాజిక సంస్కరణల చరిత్రలో ఒక గొప్ప మలుపు.
- వైద్య చరిత్ర (1842): ప్రపంచంలోనే మొదటిసారిగా శస్త్రచికిత్సలో 'అనస్థీషియా' (Anesthesia) ను డాక్టర్ క్రాఫోర్డ్ లాంగ్ విజయవంతంగా ఉపయోగించిన రోజు.
- ఫ్లోరిడా ప్రాముఖ్యత (1822): అమెరికాలోని ఫ్లోరిడా ఒక భూభాగంగా (Territory) గుర్తించబడింది.
తెలంగాణ (TG) - ముఖ్యమైన పనులు & పథకాలు:
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించింది:
- బడ్జెట్ నిధుల వినియోగం: మార్చి 31 గడువు కావడంతో, వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్ నిధుల వినియోగంపై ఆర్థిక శాఖ నేడు సమీక్ష నిర్వహిస్తోంది. పెండింగ్లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారం మరియు రైతులకు సంబంధించిన చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా తయారీ మరియు మొదటి విడత నిధుల విడుదల ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేశారు.
- పన్ను వసూళ్ల లక్ష్యం: జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఇతర మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్ల కోసం నేడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రేపటితో గడువు ముగియనుండటంతో ఆన్లైన్ సేవలను పటిష్టం చేశారు.
- విద్యార్థులకు స్కాలర్షిప్స్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులను నేడు విద్యా సంస్థల ఖాతాల్లోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ (AP) - ముఖ్యమైన పనులు & పథకాలు:
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం మరియు ఆర్థిక గడువుల ప్రకారం నేడు పలు పనులు చేపట్టింది:
- ఆస్తి పన్ను రాయితీ - చివరి 2 రోజులు: పాత బకాయిలపై వడ్డీలో 50% రాయితీ (OTS) పొందేందుకు నేడు, రేపు మాత్రమే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు రద్దీగా ఉన్నాయి.
- RTE అడ్మిషన్ల క్లోజర్: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లకు ఎంపికైన విద్యార్థులు రిపోర్ట్ చేయడానికి నేడే ఆఖరి రోజవుతుంది. సాయంత్రం లోపు సీట్ల భర్తీ వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
- రైతు భరోసా కేంద్రాలు (RBK): రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్బీకేల ద్వారా అధికారులను సమన్వయం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర నేరుగా ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
- ఉద్యోగుల జీతాలు & పెన్షన్లు: ఏప్రిల్ 1న అందాల్సిన జీతాలు, పెన్షన్ల కోసం నిధుల సర్దుబాటు ప్రక్రియను ఆర్థిక శాఖ నేడు పూర్తి చేస్తోంది.
ప్రత్యేక కథనం (Special Story):
మార్చి 30: ఆర్థిక సంవత్సరం ముగింపు - రేపు అర్థరాత్రి వరకు పనివేళలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రెజరీ (Treasury) కార్యాలయాలు నేడు, రేపు రాత్రి 12 గంటల వరకు పనిచేయనున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టర్ల బిల్లులు, పథకాల నిధులు 'లాప్స్' (Lapse) కాకుండా ఉండేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. రేపు సాయంత్రం లోపు చెల్లింపులు పూర్తయితేనే ఆ నిధులు వచ్చే ఏడాదికి ఉపయోగపడతాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రెజరీ (Treasury) కార్యాలయాలు నేడు, రేపు రాత్రి 12 గంటల వరకు పనిచేయనున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టర్ల బిల్లులు, పథకాల నిధులు 'లాప్స్' (Lapse) కాకుండా ఉండేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. రేపు సాయంత్రం లోపు చెల్లింపులు పూర్తయితేనే ఆ నిధులు వచ్చే ఏడాదికి ఉపయోగపడతాయి.
*జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి!*
హైదరాబాద్ :మార్చి.30.
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్ పత్రికకు వార్తలు రాసినట్లు ధ్రువీకరించే లేఖ సంబం ధిత అర్హత పత్రాలను జత చేయడంతో పాటు.
తాము వేరే ఇతర వృత్తుల లో అనగా సొసైటీ చైర్మన్, డైరెక్టర్ ప్రభుత్వ ఉద్యోగం, న్యాయవాద వృత్తి, సర్పంచ్ తదితర ఇతరత్రా ఏ పద పదవుల్లో కొనసాగడం లేదని సెల్ఫ్ డిక్లరేషన్ జతచేసి హార్డ్ కాపీని సంబంధిత డిపి ఆర్ఓ కార్యాలయాలలో అందజేయాలని, అప్లికేషన్ను పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే అక్రెడి టేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై సంబంధిత అధికారులకు కఠిన చర్యలకై ఆదేశాలు ఇవ్వనున్నట్లు స్పెషల్ కమిషనర్ వెల్లడించారు
ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేష న్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిం దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రక్రియ కొనసాగు తోందని తెలిపారు. ఇప్ప టికే వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
*విద్య, వైద్య రంగాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత : సీఎం రేవంత్ రెడ్డి.*
హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతితే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్టు సీఎం తెలిపారు. గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను శాసనసభ ముందు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే (SEEEPC Survey) లెక్కల ప్రకారం తెలంగాణలోని 1.15 కోటి కుటుంబాలకు “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పేదలకు జీవిత బీమా అందించి భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల వైద్యం కోసం మొత్తం రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం వెల్లడించారు. ఇందులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.2,400 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. గతంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రతి నెలా సగటున రూ.52 కోట్లు ఖర్చు పెట్టగా, ప్రస్తుతం నెలకు సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
గత ప్రభుత్వం నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీలో రూ.600.27 కోట్ల బకాయి వారసత్వంగా వచ్చిందని, ఆ భారాన్ని మోస్తూనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.2,408.51 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించినట్టు, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,480.52 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిమ్స్, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు రూ.3,000 కోట్ల వ్యయంతో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో మరో 10 వేల పడకల సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.
పేదలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రుల నిర్వహణ విధానంలో కూడా మార్పులు చేపడుతున్నామని సీఎం వివరించారు. వైద్యులకు నిర్వహణ బాధ్యతల నుంచి ఉపశమనం కల్పించి, ప్రత్యేక అధికారులను నియమించాలన్న ఆలోచనలో ఉన్నామని తెలిపారు. విదేశాల్లో పేరు గడించిన వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు అందించేందుకు ప్రత్యేక వేదికను రూపొందిస్తున్నామని చెప్పారు.
విద్య పరంగా నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, వైద్యం పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, తెలంగాణను మంచి రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
*బస్సు ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్… గ్యాస్ సిలిండర్ కలకలం!* 🚍
*-ఆంధ్రప్రదేశ్-* మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు వేగంగా వెళ్తూ టిప్పర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై దగ్ధమైంది. ఘటన అనంతరం పోలీసులు బస్సును తనిఖీ చేయగా, అందులో ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ లభ్యమైంది. దీంతో ప్రమాదానికి గల కారణాలపై అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే, ఈ సిలిండర్ పేలిందా లేదా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సిలిండర్ను పరిశీలించిన అధికారులు, అది మంటల్లో కాలిపోవడంతో నల్లగా మారిందని, పేలినట్లు మాత్రం కనిపించడం లేదని ప్రాథమికంగా పేర్కొన్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి, సిలిండర్ బస్సులోకి ఎలా వచ్చింది అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
*సిలిండర్ కోసం సహనం కోల్పోయిన ప్రజలు. ఆటోను అడ్డుకుని సిలిండర్లు తీసుకెళ్లే ప్రయత్నం..!*
హైదరాబాద్: ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యం కారణంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయలుదేరిన ఆటోను కొంతమంది వినియోగ దారులు అడ్డుకుని, అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.
గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడిచినా తమకు ఇంకా సిలిండర్ అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు, వెంటనే సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు అప్రమత్తమై, ఏజెన్సీ సిబ్బందికి సహాయం చేసి సిలిండర్లు ఎత్తుకెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ సరఫరాలో తరచుగా ఆలస్యం జరుగుతోందని పలువురు వినియోగ దారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు సమస్యపై దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
*బాధితురాలి ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కురవి పోలీసులు. వేగంగా స్పందించిన తీరుకు ప్రశంసలు..!*
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని రాజోలు గ్రామంలో జరిగిన గొడవ ఘటనలో కురవి పోలీసులు తక్షణమే స్పందించి బాధితురాలి ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమ సేవా నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై స్థానిక ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
రాజోలు గ్రామానికి చెందిన కొమ్మరాజుల వీరభద్రమ్మ (60), కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో ఆమె ఇంటి ముందు ఆటో నిలిపే విషయంలో పొరుగువారైన గుంజ రాజు, గుంజ యశోద మరియు వారి కుమారుడు సురేష్తో వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ క్రమంలో ముగ్గురు కలిసి ఆమెపై చేతులతో, కర్రతో దాడి చేయగా, వీరభద్రమ్మ కుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కురవి పోలీసులు ఆలస్యం చేయకుండా బాధితురాలి ఇంటికే చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడే బాధితురాలి నుండి పిర్యాదు స్వీకరించి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, బాధితురాలి ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసుల సేవా తత్వానికి నిదర్శనంగా నిలిచింది.
సమస్యల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ, వేగంగా స్పందిస్తున్న కురవి పోలీసుల చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
*సీఎస్ఆర్ నిధుల సమీకరణకు ప్రత్యేక పాలసి రాష్ట్ర అభివృద్ధికి కార్పొరేట్ భాగస్వామ్యం పెంపుపై సీఎం దృష్టి.*
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల సమీకరణతో పాటు వాటి సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు.
ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన సంస్థల ప్రతినిధులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
శాసనమండలి సమావేశ హాలులో ముఖ్యమంత్రి గారు సీఎస్ఆర్ నిధులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలన్నీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుందని తెలిపారు.
ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను అందించేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ ఈ పోర్టల్లో పొందుపరచాలని సూచించారు. సంస్థలు ప్రభుత్వాన్ని సులభంగా సంప్రదించేందుకు, తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు ఈ పోర్టల్ ఆకర్షణీయంగా రూపొందించాలని అన్నారు.
జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ నిధుల వాటాలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం 3 శాతం మాత్రమే వస్తోందని అధికారులు ముఖ్య మంత్రికి నివేదించారు. ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తే ఎలా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు తెలంగాణలోనే ఎక్కువగా సీఎస్ఆర్ ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో సీఎస్ఆర్ నిధుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, వాటిని పరిశీలించి కొత్త పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు. కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి సీఎస్ఆర్ నిధుల వాటాను పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలపై సమాచార హక్కు (RTI) కేసు విచారణ శనివారం Telangana State Information Commission ముందు జరిగింది. గత సంవత్సరం నుండి కొనసాగుతున్న ఈ కేసులో విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ కేసులో పిటీషనర్గా కె. అరవింద్ రెడ్డి స్వయంగా (party-in-person) కమిషన్ ముందు హాజరై, గత నెల 27వ తేదీన కమిషన్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా విద్యాధికారులు సమర్పించిన సమాధానం కూడా పిటీషనర్ను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని సాక్ష్యాలతో నిరూపించారు. మొదట ఇచ్చిన వివరాలు, తదనంతరం సమర్పించిన సమాచారం మధ్య వ్యత్యాసాలు ఉండటం, కొన్ని పాఠశాలల వివరాలు పూర్తిగా లేకపోవడం, డూప్లికేట్ ఎంట్రీలు ఉండటం, మరియు ఫీజు, మౌలిక సదుపాయాలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలను ఆయన కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఇంకా, హైస్కూల్ వరకు పర్మిషన్ ఉన్న పాఠశాలల్లో తగిన బోధన సిబ్బంది లేకపోవడం వంటి అంశాలను కూడా పిటీషనర్ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడం నిబంధనల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నదని ఆయన పేర్కొన్నారు.
పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా, అసంపూర్ణ మరియు అసంగత సమాధానాలు ఇవ్వడం ద్వారా పిటీషనర్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగినట్లు కూడా ఆయన వివరించారు. ఈ అంశాలన్నింటిని పిటీషనర్ సాక్ష్యాధారాలతో సమగ్రంగా కమిషన్ ముందు ఉంచారు.
విచారణ సందర్భంగా, జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడింది. అవసరమైతే సంబంధిత అధికారులపై పెనాల్టీ విధించే స్థితి ఉందని స్పష్టం చేసింది. అయినప్పటికీ, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరియు పూర్తి స్థాయి సమాచారం సమర్పించేందుకు తుదావకాశం ఇవ్వడం సముచితమని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో, పిటీషనర్ కూడా ప్రజా ప్రయోజనం దృష్ట్యా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయగా, సంబంధిత అధికారులకు మరొక అవకాశం ఇస్తూ కేసును వాయిదా వేయడం జరిగింది. కమిషన్ సూచనల మేరకు, సంబంధిత అధికారులు నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది.
ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థలో పారదర్శకత, నిబంధనల అ మలు, మరియు బాధ్యతాయుత పరిపాలన అవసరాన్ని బట్టి కేసు స్పష్టం చేస్తుంది.
*నిజామాబాదు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ*
*యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది : పోలీస్ కమీషనర్ వెల్లడి*
*మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి*
*Say no to drugs , yes to life అనే నినాదం తో యువత ముందుకు వెళ్ళాలి*
నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ చౌరస్తా వద్ద ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు హాజరై జండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా యువత సన్మార్గంలో నడవాలి చెడు అలవాట్లకు దూరముగా ఉండాలి , డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అనే సందేశం ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవనీయులు నిజాంబాద్ పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “యువతే దేశానికి భవిష్యత్తు. మీలో ఉన్న శక్తి , సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే మీరు మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు, వ్యాయామం చాలా అవసరం. అలాంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరం. ఒకసారి ఆ అలవాట్లలో పడితే బయటపడటం చాలా కష్టం. కాబట్టి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి మార్గాన్ని ఎంచుకోండి. మరియు మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది కావున యువకులు మరియు విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై డ్రగ్స్ బారిన పడకూడదని సూచించడం జరిగింది. ఈ సమాజంలో ఎవరైనా డ్రగ్స్ గాని గంజాయి గాని అమ్మిన మరియు సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 1908 నెంబర్ లేదా 100 కు కాల్ చేయాలని సూచించడం జరిగింది. డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీసుకురావాలని మరియు దీనికి ప్రజల సహకారం యువత సహకారం మీడియా సహకారం ఉండాలని కోరడం జరిగింది. ప్రతీ ఒక్కరితో Say no to drugs, Yes to life అని సూచించడం జరిగింది. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినండి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. మీరు సన్మార్గంలో నడిస్తే మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణం అవుతారు.
ఈ 2K రన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచడం మాత్రమే కాకుండా, డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ అందిస్తున్నదని , అందరూ ఈ సందేశాన్ని జీవితంలో ఆచరించాలి.” ఇలాంటి సందేశం ద్వారా యువతలో సానుకూల మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇట్టి కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు డాన్సులు మరియు నాటకాల రూపంలో గంజాయి యొక్క పర్యావసనాలని ప్రజలకు చూపించడం జరిగింది.
తర్వాత 2కే రన్ ని పోలీస్ కమీషనర్ గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ 2 కె రన్ బై పాస్ చౌరస్తా నుండి ఐ.డి.ఓ.సి కార్యాలయం వరకు నిర్వహించడం జరిగింది. ఈ 2కె రన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమీషనర్ గారి చేతులమీదుగా వారికి బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి , నిజామాబాదు ఏసీపీ శ్రీ ప్రకాష్ , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ, నిజామాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎస్సైలు ఎండి షరీఫ్ , ఆనంద్ సాగర్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గిరిరాజు కాలేజీ , సీఎస్ఐ కాలేజీ , వివేకానంద హై స్కూల్ , ప్రభుత్వ డైట్ కాలేజీ , ఎస్సీ హాస్టల్ , డిఎస్ టెక్నాలజీ మొదలగు కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా. డిచ్పల్లి మండలం
సాంపల్లి లో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్.
మమతా రాహుల్ సింగ్, ఉప సర్పంచ్ హరిచంద్, కార్యదర్శి దివ్య, ఎనిమిది మంది వార్డుల సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ , సుదం, దుర్గా సింగ్, మోహన్, సవాయి రామ్ , బి క్యు, వినోద్, రవి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో ఎన్జీవో ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్న అధికారులు. తో సమాచార హక్కు చట్టం కార్యకర్తలు యాక్ట్వీస్ట్ లకు శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రధానం చేశారు
మీరు అందించిన చిత్రంలోని వివరాల ఆధారంగా రూపొందించిన వార్తా కథనం ఇక్కడ ఉంది:
ఆర్ టీ ఐ ఒక శక్తివంతమైన ఆయుధం: పారదర్శక పాలనే లక్ష్యంగా MCR HRDIలో శిక్షణ
హైదరాబాద్: ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి మరియు అవినీతిని అరికట్టడానికి 'సమాచార హక్కు చట్టం' (RTI) ఒక శక్తివంతమైన ఆయుధమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని డాక్టర్ ఎం.సి.ఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCR HRDI) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన సమగ్ర శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
కీలక అంశాలపై అవగాహన:
యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టీ ఐ క్యాంపెయిన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఎన్జీఓ ప్రతినిధులు, ఆర్ టీ ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ఈ క్రింది అంశాలపై లోతైన అవగాహన కల్పించారు:
యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టీ ఐ క్యాంపెయిన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఎన్జీఓ ప్రతినిధులు, ఆర్ టీ ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ఈ క్రింది అంశాలపై లోతైన అవగాహన కల్పించారు:
- ప్రభుత్వ పథకాల అమలు మరియు పారదర్శకత.
- పొదుపు పథకాలు మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాల పర్యవేక్షణ.
- ప్రజా నిధుల వినియోగంపై నిఘా.
- ఆర్ టీ ఐ చట్టాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం మరియు ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు.
నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు:
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ టీ ఐ క్యాంపెయిన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ యంత్రాంగంలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని, సమాచారాన్ని దాచే ధోరణిని అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన సమాచారాన్ని నిరాకరించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోరాడాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ టీ ఐ క్యాంపెయిన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ యంత్రాంగంలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని, సమాచారాన్ని దాచే ధోరణిని అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన సమాచారాన్ని నిరాకరించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోరాడాలని ఆయన సూచించారు.
మరో వక్త, కో-కన్వీనర్ కె. జంగయ్య స్వామి మాట్లాడుతూ, క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పాలనను అందించడంలో ఈ శిక్షణ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యకర్తల ప్రతిజ్ఞ:
శిక్షణ ముగింపులో పాల్గొన్న ప్రతినిధులు తమ జిల్లాల్లో ప్రజలకు ఆర్ టీ ఐ పై అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వ పథకాల అమలును నిశితంగా పర్యవేక్షిస్తామని తీర్మానించారు. అవసరమైతే ప్రజా హితం కోసం న్యాయపోరాటాలకు కూడా వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు.
శిక్షణ ముగింపులో పాల్గొన్న ప్రతినిధులు తమ జిల్లాల్లో ప్రజలకు ఆర్ టీ ఐ పై అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వ పథకాల అమలును నిశితంగా పర్యవేక్షిస్తామని తీర్మానించారు. అవసరమైతే ప్రజా హితం కోసం న్యాయపోరాటాలకు కూడా వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు.
రేపు 31 మార్చి 2026 నాటికి మీరు పూర్తి చేయాల్సిన ఆదాయపు పన్ను (Income Tax) పొదుపు పథకాలు లేదా పెండింగ్ ప్రభుత్వ దరఖాస్తుల గురించి మరింత సమాచారం కావాలా?
జయ హో ఇండియా న్యూస్ పేపర్ లో చూడండి.
@Jaihoindianews.
న్యూస్ ఎడిటర్ శ్రీ కట్టా నరేశ్ కుమార్ నాయక్ 🎤 జర్నలిస్ట్ 📱 8143488840.
Comments
Post a Comment