"పాలి సెట్ ఆలస్యం"
*పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం*
నేటి నిఘా న్యూస్.
హైదరాబాద్: పాలిసెట్కు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ఈ నెల రెండో వారంలో మొదలవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటెట్) ప్రకటించినా అది ఆలస్యం కానుంది. కనీసం మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా. పాలిసెట్ టైంటేబుల్ను ఎస్బీ టెట్ అధికారులు మార్చి 24న విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ రెండో వారంలో మొదలవుతుందని ప్రకటించినా అది ప్రారంభం కాలేదు. ఎస్ఎస్సీ బోర్డు అధికారులు పదో తరగతి విద్యార్థులకు హాల్టికెట్ నంబర్లు కేటాయిస్తేనే పాలిసెట్ దరఖాస్తుల సమర్పణ సాధ్యమవుతుంది. విద్యార్థులు పదో తరగతి పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 14వ తేదీతో ముగిసింది.
Comments
Post a Comment