*కవిత లిక్కర్ కేసు*
*దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు*
★ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద
★ ఈనెల 6న ఉదయం 11గంటలకు...
నేటి నిఘా న్యూస్:
(కట్టా నరేశ్ కుమార్ నాయక్ ✍️జర్నలిస్ట్)
*దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని, హైదరాబాద్ లేదా దిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో పేర్కొంది. సీబీఐ నుంచి తనకు నోటీసులు అందినట్టు ఎమ్మెల్సీ కవిత ధ్రువీకరించారు. ఈనెల 6న హైదరాబాద్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపినట్టు కవిత వెల్లడించారు.
Comments
Post a Comment