ఏ సి బి కి చిక్కిన లంచగొండి

"ఏ సి బి కి చిక్కిన లంచగొండి"
నేటి నిఘా న్యూస్

అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్ 
ఏసీబీ వలలో సచివాలయ సర్వేయార్ లంచం తీసుకుంటుండగా పక్కాగా పట్టుకున్న ఏసీబీ  పోలీసులు
 
బాపట్ల జిల్లా :  గ్రామ సచివాలయ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా పక్కా స్కెచ్ తో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శనివారం వేమూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.వివరాల ప్రకారం వేమూరు మండలం పెరవలి పాలెం గ్రామ సచివాలయ సర్వేయర్ గా పనిచేస్తున్న షేక్ షబ్బీర్ హుస్సేన్ పెరవలి పాలెం గ్రామానికి చెందిన జవ్వాజి రత్తమ్మ కు సంబంధించిన పొలం సర్వేకు సంబంధించి లంచం డిమాండ్ చేయటంతో జవాజి రత్తమ్మ కుమారుడు జవ్వాజి వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.గ్రామంలోని రత్తమ్మకు చెందిన 1.37 సెంట్లు ఉండగా అందులో 1.27 సెంట్లు ఆన్లైన్లో ఎక్కించారు.  మిగిలిన 13 సెంట్ల ఆన్లైన్లో ఎక్కించేందుకు 21వ తేదీన దరఖాస్తు చేసుకోగా 24వ తేదీన సర్వే నిర్వహించారు. అందుకు సంబంధించి పత్రాన్ని అందించేందుకు   డిమాండ్ చేయగా రత్తమ్మ కుమారుడు వెంకటేశ్వరరావు అవినీతి అధికారులనుశాఖ అధికారులను ఆశ్రయించగా తహశీల్దార్ కార్యాలయం  వద్ద రూ.వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దాడి చేసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీలు టీవీవీ ప్రతాప్, సత్యానందంలు తెలిపారు. ఈ దాడులలో సీఐలు నాగరాజు, మన్మధరావు,లక్ష్మారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026