"BSP రాజస్థాపన కోసం కృషి చేయాలి"
*బహుజన కులాల ఐక్యం తోనే BSP విజయం సాధ్యం*
*BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం*
బహుజన కులాల ఐక్యం తోనే BSP విజయం సాధ్యం అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ *నిషాని రామచంద్రం* అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు *Dr.R.S.ప్రవీణ్ కుమార్ సర్* ఆదేశాల మేరకు ఈ రోజు
*నిజామాబాద్ జిల్లా సమీక్షా*
సమావేశం కు
*ముఖ్య అతిథి* గా
*నిషాని రామచందర్* గారు హాజరు అయ్యారు
ఈ సమావేశం
బహుజన గీతం తో సమీక్షా ప్రారంభం చేసారు.
5 అసెంబ్లీ లను రివ్యూ చేసారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణం ను రిపోర్ట్ రాసుకొని అందరికి పని విభజన చేసారు.
ఈ సమీక్షా సమావేశంలో
బోధన్ అసెంబ్లీ ఇంచార్జ్ పాండు గారు చేసిన పని విదానం మరియు సమర్పించిన రిపోర్ట్
వర్క్ బాగా చేసినందుకు నిషాని రామచంద్రం గారు పాండు గారిని శాలువా తో సత్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఈ తెలంగాణలో 1% ఉన్న దొరలే మన శత్రువులు అని, BRS మోసాలు BJP రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను ప్రజలకు చెప్పి చైతన్యం చేయాలని అన్నారు. సబ్బండ కులాలు కొట్లాడి రాజ్యాంగ ప్రక్రియ ద్వారా 1300 మంది అమరుల బలిదానం తో వచ్చిన తెలంగాణ కొందరి చేతుల్లో బంది అయిందని ...కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్న Dr . R.S. ప్రవీణ్ కుమార్ వెంట ఉండి తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహుజన ఉద్యమం విజయం సాదించాలంటే నాయకత్వం కి బహుజన సిద్ధాంతం పట్ల స్పష్టత ఉండాలని, మహనీయుల ఆశయాలను ప్రేమించాలని, కార్యకర్తల ను శాస్రియ పద్ధతి లో ఎంపిక చేయాలనీ, నిరంతర శిక్షణ తరగతులు నిర్వహించాలని, బహుజన కులాలను కలపాలని , వారికి రాజ్యం విలువ చెప్పి అమ్ముడు పోనీ సమాజం ను నిర్మించాలని, కమిటీ ల నిర్మాణం పూర్తి చేయాలనీ అప్పుడే మనం దేశం లో *బెహేంజీ గారిని PM* రాష్ట్రo లో *Dr.R.S.praven kumar sir* గారిని CM చేయగలం అన్నారు. నిజామాబాదు అర్బన్ అధ్యక్షులను అర్బన్ ఇంచార్జ్ ని జిల్లా అధ్యక్షులు పళ్ళికొండ నర్సయ్య నియమించారు. జిల్లలో ఉన్న నాయకులకు పని విభజన చేసారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్ల శ్రీనివాస్, జిల్లా ఇంచార్జ్ గైని గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు చిలుముల గణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్,కోశాధికారి హరీష్,
అసెంబ్లీ ఇన్చార్జ్ లు, అసెంబ్లీ అధ్యక్షులు, అసెంబ్లీ మరియు మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment