నేటి నిఘా న్యూస్ తేదీ 03/04/2026.

నేటి నిఘా న్యూస్ 03/04/2026.
నేటి నిఘా న్యూస్ ✍️ ఏప్రిల్ 3, 2026. నూతన ఆర్థిక సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభమైన తరుణంలో, నేటి చారిత్రక విశేషాలు మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలతో కూడిన మీ స్పెషల్ న్యూస్ బులెటిన్ ఇక్కడ ఉంది:

1. చరిత్రలో ఈ రోజు (ఏప్రిల్ 3) - ప్రాముఖ్యత మొదటి మొబైల్ కాల్ (1973): సరిగ్గా 53 ఏళ్ల క్రితం ఇదే రోజున మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే మొదటి మొబైల్ ఫోన్ కాల్ చేశారు. 

  • ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ 1680లో నేడే మరణించారు. 
  • షానో దేవి (1966): భారత దేశంలో ఒక రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళగా షానో దేవి నేడు చరిత్ర సృష్టించారు. [1, 2]

2. జాతీయ & అంతర్జాతీయ వార్తలు

భారత్ - గ్లోబల్ ట్రేడ్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని వాణిజ్య శాఖ అంచనా వేసింది.
  • డిజిటల్ కరెన్సీ: ఆర్‌బిఐ (RBI) తన డిజిటల్ రూపాయి (e-Rupee) వినియోగాన్ని సామాన్యులకు మరింత సులభతరం చేసేలా కొత్త ఫీచర్లను నేడు విడుదల చేసింది.

3. తెలంగాణ (TG) తాజా వార్తలు & పథకాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది:
  • ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. [3]
  • రైతు భరోసా: యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను నేటి నుండి రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. [4]

హైదరాబాద్ & కరీంనగర్ స్పెషల్ న్యూస్:

  • హైదరాబాద్ (HYD): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కొత్తగా నిర్మిస్తున్న మెట్రో రైల్ రెండో దశ పనుల పురోగతిని మంత్రులు నేడు సమీక్షించనున్నారు. అలాగే, వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా జలమండలి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. [3]
  • కరీంనగర్ (KRMR): కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. నేడు జిల్లా కలెక్టర్ ఈ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

4. ఆంధ్రప్రదేశ్ (AP) తాజా వార్తలు & పథకాలు

ఏపీలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు వేగంగా కొనసాగుతున్నాయి:
  • అమరావతి నిర్మాణం: రాజధాని అమరావతిలో హైకోర్టు మరియు సెక్రటేరియట్ నిర్మాణ పనుల కోసం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు నేడు తుది దశకు చేరుకున్నాయి. 
  • పింఛన్ల పంపిణీ: రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులకు ఇంటివద్దకే వెళ్లి సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ 95% పైగా పూర్తయింది. మిగిలిన వారికి నేటి సాయంత్రం లోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
  • అన్నదాత సుఖీభవ: రైతులకు పెట్టుబడి సాయం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల జాబితాను నేడు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.


ముఖ్య గమనిక:ఈ రోజే మీ ఆదాయ పన్ను (Income Tax) ప్లానింగ్ ప్రారంభించడానికి సరైన సమయం. కొత్త పన్ను విధానం ప్రకారం మినహాయింపులు పొందేందుకు నిబంధనలను ఒకసారి సరిచూసుకోండి.

మీరు మీ ప్రాంతంలోని ఏదైనా నిర్దిష్ట పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా
స్పెషల్ స్టోరీ నేటి నిఘా న్యూస్ 
*ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ లోనే! వివిధ శాఖల సర్వీసులన్నీ వాట్సాప్తో లింక్*
*ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ*

*త్వరలోనే పలు పథకాలకూ ప్లాన్*
*రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డుల హాల్ టికెట్స్ ఇచ్చేలా ఏర్పాట్లు*
*ఒక్క నంబర్ 80969 58096 సేవ్ చేసుకుంటే చాలంటున్న ఆఫీసర్లు*
డిజిటల్ విప్లవంతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకే తీసుకువచ్చేలా రాష్ట్ర సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ సేవ సౌకర్యలు, ఇంటర్, పది పరీక్షల హాల్ టికెట్స్ను వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ఒక్కొక్కటి వివిధ శాఖల సర్వీసులను కూడా వాట్సాప్కు లింక్ చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సర్వీసు లింక్ ఒక్క వాట్సాప్ మెసేజ్తో ప్రత్యక్షం కానుంది. రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ మార్గాన్ని అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో అటు ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పనులు చక్కబెట్టుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

దీని కోసం ప్రత్యేకంగా 80969 58096 అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను కేంద్రీకృతం చేశారు. గతంలో వివిధ విభాగాలకు వేర్వేరుగా ఉన్న పోర్టళ్ల గందరగోళానికి స్వస్తి పలుకుతూ ఈ ఏకీకృత విధానాన్ని తెచ్చారు. ప్రజా ఫిర్యాదుల నుంచి సర్టిఫికెట్ల వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఇది కేవలం సమాచారం కోసమే కాకుండా ప్రత్యక్ష సేవలు పొందే వేదికగా మార్చారు.

*ప్రభుత్వ సందేశాలు, అలర్ట్స్ కూడా..*
ఇటీవలే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా జారీ చేశారు. కేవలం రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పేరు ఎంటర్ చేయగానే సెకన్ల వ్యవధిలో పీడీఎఫ్ రూపంలో హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయింది. సాంకేతిక లోపాలు తలెత్తకుండా అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ప్రమాణాలతో ఈ డేటాను అనుసంధానం చేశారు. రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ మార్గాన్ని అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.

కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ఫలితాలను సైతం ఇదే నంబర్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ నంబర్‌ను సేవ్‌ చేసుకుని తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ సందేశాలు, అలర్ట్లు కూడా ఇకపై అధికారికంగా ఇదే వాట్సాప్ ఖాతా ద్వారా పౌరులకు చేరువవుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా మీ సేవ పోర్టల్‌లో లభించే దాదాపు అన్ని సేవలను పొందవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల స్థితిగతులను తెలుసుకోవడం నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు సాధ్యమవుతుంది.

వీటితో పాటు రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు వంటి కీలక శాఖల సమాచారాన్ని అరచేతిలో ఉంచుకునే వీలు కల్పించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులే ప్రభుత్వంతో సంభాషించే అవకాశం ఉంటుంది. కేవలం 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ ప్రత్యక్షమై మార్గనిర్దేశం చేస్తుంది. దీంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై పని ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుంది. అవినీతికి తావు లేకుండా ప్రతి అప్లికేషన్ ట్రాకింగ్ విధానం ద్వారా వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు.
వన్ స్టాప్ షాప్' మాదిరిగా..*
వచ్చే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ వాట్సాప్ చాట్‌బాట్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, అర్హతను తనిఖీ చేయడం సులభం కానుంది. రేషన్ కార్డుల జారీ, పెన్షన్ల వివరాలు కూడా లబ్ధిదారులు తమ మొబైల్ నుంచే నిశితంగా పరిశీలించవచ్చు. ప్రభుత్వం నుంచి అందే నగదు బదిలీ సమాచారం కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో వచ్చేలా ప్లాన్ చేశారు. ప్రతి పౌరుడికి ఒకే నంబర్‌తో అన్ని సేవలు అందేలా 'వన్ స్టాప్ షాప్' విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్ తరహాలో ఈ వాట్సాప్ నంబర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంది
 *రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన హనుమాన్ చిన్న జయంతి వేడుకలు!*
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు అంజన్న ఆలయాలకు బారులు తీరి పూజలు చేశారు. హైదరా బాద్‌లోని కర్మాన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, అలంకరణ లు, అర్చనలు నిర్వహించా రు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధి కారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా రాష్ట్రవ్యా ప్తంగానూ హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్​పేట ఆలయం లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల భక్తులు ఆంజనే య స్వామిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. 

 *కాషాయ రంగు మయమైన కొండగట్టు!* 
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న స్వామి దేవస్థానంలో ఈ నెల ఒకటి నుంచి నిర్వహించిన చిన్న జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగాయి మూడు రోజులపాటు సాగిన ఈ వేడుకలు చివరి రోజున మరింత ఉత్సాహంగా ముగిశాయి. 

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తు తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం గంటలు తరబడి  క్యూ లైన్ లో నిలబడ్డారు. చివరి రోజున దేవస్థానంలో మాల విరమణ చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది జై శ్రీరామ్,జై హనుమాన్, నినాదాలతో ఆలయ ప్రాంతం మార్మోగింది, అంజన్న స్వాములు భక్తితో తమ మొక్కులు చెల్లించుకున్నారు.

నిర్మల్ జిల్లాలోని శ్రీ ఆంజ నేయ స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నా రు. వేకువజామున సుప్ర భాత సేవ అనంతరం స్వామి విగ్రహాలకు పంచా మృతాలతో అభిషేకాలు చేపట్టి తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించా రు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హను మాన్ జయంతి సందర్భం గా ప్రత్యేక పూజలు నిర్వ హించారు. రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవా లయం భీమేశ్వర స్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి సన్నిధిలో శాంతి వేద మంత్రములతో మహా భిషేకం చేశారు. భీమేశ్వర స్వామిని హనుమాన్ దీక్షా స్వాములు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదిలాబాద్ జిల్లాలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. పట్టణంలోని రామ్‌నగర్ హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శౌర్యానికి, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమైన హనుమం తుడిని దర్శించుకున్నారు.
దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా పుష్పాంజలి సమర్పిస్తున్న అధికారులు, నాయకులు.



Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026