నేటి నిఘా న్యూస్ ✍️ 10/04/2026
నేటి నిఘా న్యూస్ 📰 10/04/2026
నాటి చారిత్రక విశేషాలు, ప్రపంచ పరిణామాలు మరియు తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో కూడిన ప్రత్యేక కథనం ఇక్కడ ఉంది:
1. చరిత్రలో ఈరోజు (ఏప్రిల్ 10) - ప్రత్యేకతనేడు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రోజు.
- ప్రపంచ హోమియోపతి దినోత్సవం: హోమియోపతి వైద్య విధాన వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హనెమాన్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 10ని 'ప్రపంచ హోమియోపతి దినోత్సవం'గా జరుపుకుంటారు.
- టైటానిక్ ప్రయాణం (1912): ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఓడ 'టైటానిక్' తన మొదటి మరియు చివరి ప్రయాణాన్ని ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ రేవు నుండి నేడే ప్రారంభించింది.
- మొదటి ఆఫ్రికన్ అమెరికన్ టెన్నిస్ ఛాంపియన్ (1943): ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు ఆర్థర్ యాష్ జన్మించారు.
2. ప్రపంచ వేదికపై ప్రస్తుత పరిణామాలు (ఏప్రిల్ 2026)పర్యావరణ ఒప్పందాలు: గ్లోబల్ వార్మింగ్ను తగ్గించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో, 2030 నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని 80% తగ్గించాలని అంతర్జాతీయ సమాజం నిర్ణయించింది.
- అంతరిక్షంలో కొత్త అడుగులు: అంగారక గ్రహం (Mars) పై మానవ నివాసానికి సంబంధించి నాసా (NASA) నేడు కీలకమైన శాస్త్రీయ డేటాను విడుదల చేయనుంది.
3. భారత రాజకీయాలు - తాజా వార్తలు జాతీయ రాజకీయాలు: దేశవ్యాప్తంగా 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' (One Nation - One Election) పై పార్లమెంటరీ కమిటీ రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తోంది. దీనిపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది.
- ఆర్థిక రంగం: భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో స్థిరపడటంతో, విదేశీ పెట్టుబడులు (FDI) గణనీయంగా పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
4. తెలుగు రాష్ట్రాల అప్డేట్స్ (TG & AP)
తెలంగాణ (TG) - ప్రభుత్వం చేస్తున్న పనులు:
- రైతు భరోసా & రుణమాఫీ: రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతు భరోసా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
- హైదరాబాద్ మెట్రో విస్తరణ: మెట్రో రెండో దశ పనులకు సంబంధించి పాతబస్తీ లైన్ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- మహిళా శక్తి: స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ (AP) - ప్రభుత్వం చేస్తున్న పనులు:
- అన్న క్యాంటీన్లు: నేడు రాష్ట్రవ్యాప్తంగా మరో 50 కొత్త అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. తక్కువ ధరకే పేదలకు భోజనం అందించడమే దీని లక్ష్యం.
- తల్లికి వందనం: విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి, అర్హులైన తల్లుల ఖాతాల్లో ₹15,000 జమ చేసే ప్రక్రియను విద్యాశాఖ నేటితో ఖరారు చేయనుంది.
- అమరావతి రాజధాని: అమరావతిలో 'హ్యాపీ సిటీ' ప్రాజెక్టు కింద రోడ్లు, డ్రైనేజీ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు గడువు విధించారు.
- దీపం పథకం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులను తొలగించి, లబ్ధిదారులందరికీ సకాలంలో అందేలా చర్యలు చేపట్టారు.
పోలీస్ కమిషనర్ .నిజామాబాద్ జిల్లాలో బ్రేకింగ్
న్యూస్.
*నిందితునికి స్థానిక నిజామాబాద్ కోర్టు జీవిత ఖైదీ విధింపు*
సంచలన తీర్పు. నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం. కేసు కి సమాచారం కీలక ఆధారాలు సాక్ష్యాలు కేసు దర్యాప్తు కు సంబంధించిన ఈ కేసులో పోలీసులు,న్యాయవాది,కి అభినందనలు తెలిపిన సిపి, సాయి చైతన్య.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేర పరిశోధన కేసు వివరాలు కీలక విషయాలు వెలుగులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా. కి చెందిన ఈ ఘటన లో అధికారుల పని తీరును ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు.
*కేసు పరిపక్వతలో మెలకువలు తీసుకువచ్చి నేరస్తునికి శిక్షపడే దానికి కృషి చేసిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్*
డిచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 14, 2021 సంవత్సరం నాడు మండల కేంద్రంలో మామ , అల్లుడు , బామ్మర్ది ముగ్గురు కలిసి ఒక పని నిర్వహించడానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం సమయంలో డబ్బులు పంచుకునే విషయంలో చిన్న గలాట జరగడం వలన అక్కడే ఉన్నటువంటి కత్తిని పదను చేసేటటువంటి ఆకు రాయితో మరియు చాకు తో బామ్మర్దిని మరియు మామని అతి దారుణంగా పొడిచి చంపడం జరిగింది.
ఇట్టి కేసును విచారణ అధికారిగా అప్పట్లో శ్రీ రఘునాథ్ సిఐ గారు విచారించడం జరిగింది. అనంతరం ప్రస్తుతం ఉన్నటువంటి సీఐ శ్రీ వినోద్
రెడ్డి గారు చాకచక్యంగా ఇట్టి కేసులో ఎంతో పరిపక్వత సాధించి నేరస్తులను కోర్టులో హాజరు పరిచి త్వరితగతి నా కేసు పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. ఈ నేరంలో గల నేరస్తుడిని కర్ణాటక రాష్ట్రంలో ఉండడం వలన అతని ఆచూకీ తెలుసుకొని , అట్టి నేరస్తుని పట్టుకొని జిల్లా జైలులో పెట్టి అతనికి శిక్ష పడే వరకు జిల్లా కోర్టులో హాజరుపరచగా , నేడు అట్టి కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పును *గౌరవనీయులు నిజామాబాదు జిల్లా జడ్జి శ్రీమతి జి.వి.ఎన్ భారత లక్ష్మి* గారు నేరస్తునికి జీవిత ఖైదీ మరియు 2000/- జరిమానా విధించడం జరిగింది. జరిమానా కట్టని యెడల అదనముగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పై సంచలన తీర్పు ఇచ్చిన
డిచ్పల్లి కోర్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీ కె కిషన్ త నిజాంబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్. అభినందించారు.
ఇట్టి కేసులో నేరస్తునికి శిక్షపడే దానికి కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ రాజేశ్వర్ మరియు డిచ్పల్లి సిఐ శ్రీ వినోద్ రెడ్డి , జిల్లా కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై శ్రీ గోవింద్ మరియు డిచ్పల్లి కోర్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీ కె కిషన్ తదితరులను *గౌరవనీయులు నిజాంబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్. అభినందించడం జరిగింది.
*మన ఊరు - మన భద్రత - మన బాధ్యత : పోలీస్ కమిషనర్ వెల్లడి*.
*“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై గ్రామ సర్పంచ్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులతో
*మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని .
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని కామాక్షి కన్వెన్షన్ హాలు నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ
*గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి* ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రమాదాలు కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయాదరులు
రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు
ట్రాఫిక్ నియమాలు పాటించాలని ,
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని ,
ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
*ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి మాట్లాడటం జరిగింది*.
ఇట్టి కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి , ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీ కాటిపల్లి గంగారెడ్డి , ఆర్మూర్ ఎసిపి శ్రీ వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసిపి, శ్రీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సిఐ శ్రీ సత్యనారాయణ , ఆర్మూర్ రూరల్ సీ.ఐ శ్రీ జి. జాన్ రెడ్డి , మరియు ఐ-రాడ్ మేనేజర్ శ్రీ వర్ష , ఆర్మూర్ డివిజన్ ఎస్.ఐ లు శ్రీ రజనీకాంత్ , సంజీవ్ , అనిల్ , రాము , శ్యామ్ రాజ్ , శైలేందర్ , కిరణ్ పాల్ , రాజేశ్వర్ , మరియు NSC కౌన్సిల్ మెంబర్స్ శ్రీ సుందర్ , క్రాంతి గంగారెడ్డి , నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ శ్రీ వై.సాయ రెడ్డి , సాగర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ లు ,వార్డ్ కౌన్సిలర్లు , ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ 📰
ఎడిటర్ శ్రీ కట్టా నరేశ్ కుమార్ నాయక్ 🎤 జర్నలిస్ట్ 📱 7097988840.
Comments
Post a Comment